హైదరాబాద్ కారు ప్రమాదం.. ఎంపీ లింగమనేని రమేష్ స్పందన

BC7News
By
1 Min Read

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాద సమయంలో తన కుమారుడు సంజుష్ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

image

ఈ నేపథ్యంలో స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్.. ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

📄 Generate e-Paper Clip
Share This Article