ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆందోళనలు… ఇలా అనేక కారణాలతో నేటి కాలంలో స్ట్రెస్ సాధారణ సమస్యగా మారింది. అయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఖరీదైన చికిత్సలు అవసరం లేదని, రోజువారీ జీవితంలో కొన్ని మంచి అలవాట్లు అలవరుచుకుంటే చాలావరకు ఉపశమనం పొందవచ్చని వారు చెబుతున్నారు. ముఖ్యంగా క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదలై మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఆందోళన, డిప్రెషన్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి స్టాటిక్ సైక్లింగ్ మంచి ఎంపికగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు వ్యాయామం చేసే సమయంలో తగినంత నీరు తాగడం, అవసరమైతే తేలికపాటి అల్పాహారం వెంట ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారం కూడా మానసిక ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది. పప్పుధాన్యాలు, అరటిపండ్లు, పెరుగు, కొబ్బరి, ఓట్స్ వంటి పోషకాహారం శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పెరుగులోని మంచి బ్యాక్టీరియా, ఓట్స్లోని పోషకాలు మూడ్ను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.

నిపుణుల సూచన ప్రకారం ప్రతిరోజూ వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, విశ్రాంతి వంటి