bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsతెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన.. గడల శ్రీనివాస్‌ పేరును ప్రకటించిన… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 24 Aug 2026, 9:01 am  |  Posted by : BC7NEWS
👁 3 💬 0
Latest News

తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన.. గడల శ్రీనివాస్‌ పేరును ప్రకటించిన పార్టీ

తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన.. గడల శ్రీనివాస్‌ పేరును ప్రకటించిన పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావును తమ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్న గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వానికి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపినట్లు తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక శాసనమండలి స్థానానికి జనసేన అభ్యర్థిని నిలబెట్టడం ఇదే ప్రప్రథమం కావడం గమనార్హం. 2027 మార్చి తర్వాత ఈ ఎన్నిక జరగనుండగా, ఇతర ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే జనసేన వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనమండలిలో గళం వినిపిస్తానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల కార్యాచరణపై చర్చించేందుకు సెప్టెంబర్ 13న ఖమ్మంలో ‘జనసేన-శంఖారావం’ పేరుతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామం తెలంగాణలో పార్టీ విస్తరణకు తొలిమెట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.